హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ: సింగూరు నీటిపై రభస

By Staff
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: సింగూరు జలాలను నిజాంసాగర్ కు మళ్లించే విషయంపై బుధవారం శాసనసభలో తీవ్ర రభస జరిగింది. మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇచ్చిన సమాధానంతో తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగూరు జలాలను నిజాంసాగర్ కు మళ్లిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, ఆ హామీ అమలు కావడం లేదని తెలుగుదేశం సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, మండవ వెంకటేశ్వర రావు తదితరులు సభ ప్రశ్నోత్తరాల సమయంలో విమర్శించారు. ఈ సమయంలో మంత్రి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని సభ్యులు సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు.

తెలుగుదేశం, తెరాస సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. సభ సజావుగా జరగడానికి సహకరించాలని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి పదే పదే సూచించారు. ఆ సూచనలను వారు పట్టించుకోలేదు. ఇలాగైతే సభను నడిపించడం సాధ్యం కాదని, తాను సభను వాయిదా వేస్తానని స్పీకర్ చెప్పారు. ప్రతి రోజూ ఏదో ఒక విషయంపై గొడవ చేయడం సరి కాదని ఆయన చెప్పారు. అయినా సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభ్యులు స్పీకర్ వెల్ లోకి చేరుకుని సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. తాము సింగూరు నుంచి హైదరాబాదు సికింద్రాబాద్ జంటనగరాలకు సింగూరు నుంచి జలాలను తరలించడానికి కొత్తగా పైపులైన్లు వేయలేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద భూములకు తగిన విధంగా నీరందిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ విషయంపై చర్చించడానికి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో సభ సద్దుమణిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X