హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అల్లు అరవింద్ కు లీగల్ నోటీసు

By Staff
|
Google Oneindia TeluguNews

Allu Aravind
హైదరాబాద్: రామ్ చరణ్ తేజ నటించిన మగధీర సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. చండేరీ నవలా రచయిత ఎస్పీ చారి మగధీర సినిమా నిర్మాత అల్లు అరవింద్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు. తన నవలకు కాపీ కొట్టారని ఆరోపిస్తూ ఆయన ఈ లీగల్ నోటీసు ఇచ్చారు. వారంలోగా తనకు నష్టపరిహారం చెల్లించాలని, లేకపోతే కోర్టుకెక్కుతానని చారి అల్లు అరవింద్ కు ఇచ్చిన లీగల్ నోటీసులో చెప్పారు.

కాగా, మగధీర సినిమాను మంగళవారం సాయంత్రం శాసనసభ్యులు చూశారు. శాసనసభ్యులకు టికెట్లు పంపిణీ చేసే బాధ్యతను ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావు తీసుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షో కోసం ఆయన 150 టికెట్లు తెచ్చారు. ఒక్కో శాసనసభ్యుడు రెండు, మూడు చొప్పున టికెట్లు ఇచ్చారు. జివికె ఐనాక్స్ లో శాసనసభ్యులు సినిమా చూశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X