హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుపై ప్రసన్న మరో లేఖాస్త్రం

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి ఆ పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గురువారం మరో లేఖాస్త్రం సంధించారు. ఇది ఆయన చంద్రబాబుకు రాసిన నాలుగో లేఖ. అయితే ఆ లేఖను తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించనవారంతా నిరాకరించారు. ఆ తర్వాత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరో అసమ్మతి శాసనసభ్యుడు బాలనాగిరెడ్డితో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎలాగైనా ఈ లేఖను చంద్రబాబుకు అందిస్తామని ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పారు. చంద్రబాబుపై ఆయన మరోసారి తీవ్ర విమర్సలు చేశారు.

చంద్రబాబు నియంతృత్వ పోకడ నుంచి పార్టీని, కార్యకర్తలను కాపాడాలన్నదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. చంద్రబాబు అంతటి పచ్చి అవకాశవాది భారత రాజకీయాల్లో మరొకరు లేరని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు మారుతారేమో, తాము వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్తారేమో అని భావించామని, అయితే అందుకు విరుద్ధంగా చంద్రబాబు తమపైనే ఎదురు దాడికి దిగుతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబును చూసి ప్రజలు ఓటేయలేదని, ఎన్టీఆర్ ను చూసి తెలుగుదేశం పార్టీకి ఓటేశారని ఆయన అన్నారు. ఓటమిని తట్టుకోలేకనే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లపై చంద్రబాబు టన్నుల కొద్ది ప్రేమ కురిపిస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X