చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైలో మరో స్వైన్ ఫ్లూ మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Swine Flu
న్యూఢిల్లీ: స్పైన్ ఫ్లూ వల్ల చెన్నైలో మరో మరణం సంభవించింది. 47 వ్యక్తి శుక్రవారం ఉదయం చెన్నైలో మరణించాడు. దీంతో తమిళనాడులో స్వైన్ ఫ్లూతో మరణించిన వారి సంఖ్య 45కు చేరుకుంది. స్వైన్ ఫ్లూ వల్ల గురువారం ఒక్క రోజే 10 మంది మరణించారు. ఒక్క రోజులో ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి. కర్నాటకలో నలుగురు, ఇద్దరు ఢిల్లీలో, ఇద్దరేసి ఢిల్లీ, గుజరాత్ ల్లో, ఒక్కరు పూణేలో గురువారం మరణించారు.

స్వైన్ ఫ్లూ మరణాల విషయంలో కర్నాటక రెండో స్థానానికి చేరుకుంది. కర్నాటకలో 11 మంది మరణించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 24 మంది మరణించారు. పూణేలోనే 16 మంది చనిపోయారు. గుజరాత్ లో ఐదుగురు మరణించారు. కేరళ, తమిళనాడుల్లో ఒక్కరేసి మృతి చెందారు.

కొత్తగా దేశంలో 159 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 2,401కి చేరుకుంది. ఢిల్లీలో గురువారం తొలిసారి ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. కర్నాటకలో కృష్ణవేణి, కల్పన అనే ఇద్దరు మహిళలు గురువారం మరణించారు. ప్రేమ ఈ నెల 16వ తేదీన మరణించింది. ఎడ్వర్డ్ మోహన్ బుధవారం మరణించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X