హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ నుంచి ప్రతిపక్షాల వాకౌట్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: కరువు ప్రాంతాలను ప్రకటించడంలో తమకు ఎలాంటి భేషిజాలు లేవని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. కరవుపై జరిగిన చర్చకు ఆయన శుక్రవారం శాసనసభలో సమాధానమిచ్చారు. సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన అన్నారు. కరవు వస్తే ఎక్కువగా కష్టపడేది రైతులు, కూలీలేనని, అందుకే వారిని ఆదుకోవడానికి తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకు 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు మంత్రి వట్టి వసంత కుమార్ చెప్పారు. కరువుపై ప్రభుత్వ అలసత్వంపై అంతకు ముందు ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశఆయి. కరవు సహాయక చరయ్లు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వెంటనే కరవు మండలాలను ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలని కూడా ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X