లాడ్జిలో ఆ నలుగురిది హత్యే
వారు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో లాడ్జికి వచ్చారు. వారితో పాటు మరో ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్తీలు వచ్చారని, మొత్తం మూడు కుటంబాలు వచ్చాయని లాడ్జి సిబ్బంది చెబుతున్నారు. మూడు గదులు బుక్ చేసుకున్నారని, అయితే వారు కూకట్ పల్లి చిరునామా ఇవ్వడంతో స్థానిక చిరునామా పనికి రాదని చెప్పామని, దాంతో రాత్రి విజయవాడ చిరునామా ఇస్తామని చెప్పినట్లు లాడ్జి మేనేజర్ చెబుతున్నాడు.
రాత్రి పూట ఇద్దరు స్త్రీలు, పురుషులు బయటకు వెళ్లిపోయారని, విజయవాడ చిరునామా ఇవ్వలేదని, ఆ మూడు కుటుంబాల అలికిడి కనిపించకపోవడంతో తాము గదుల వద్దకు వెళ్లామని, తాళాలు వేసి ఉన్నాయని, దాంతో కిటికీలోంచి గదిలోకి చూశామని, గదిలో రక్తం మడుగులో ఒక వ్యక్తి పడి ఉన్నాడని, దాంతో పోలీసులకు సమాచారం అందించామని లాడ్జి సిబ్బంది చెబుతున్నారు. ఈ రెండు జంటల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతులను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారిగా అనుమానిస్తున్నారు. వారి వద్ద దుబాయ్ కి చెందిన ఫ్లయిట్ టికెట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.