తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాడ్జిలో ఆ నలుగురిది హత్యే

By Staff
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని ప్రైవేట్ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఆ నలుగురిది హత్యేనని భావిస్తున్నారు. వారికి విషాహారం ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారని కూడా తెలుస్తోంది. వారిని ప్రసాద్, విజయలక్ష్మి, కవిత, కేతన్ లుగా గుర్తించారు. వారు ఈ నెల 14వ తేదీన తిరుపతి వెళ్లి హైదరాబాదు వచ్చినట్లు తెలుస్తోంది. వారి వద్ద తిరుపతికి సంబంధించిన టోకెన్ లభించింది.

వారు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో లాడ్జికి వచ్చారు. వారితో పాటు మరో ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్తీలు వచ్చారని, మొత్తం మూడు కుటంబాలు వచ్చాయని లాడ్జి సిబ్బంది చెబుతున్నారు. మూడు గదులు బుక్ చేసుకున్నారని, అయితే వారు కూకట్ పల్లి చిరునామా ఇవ్వడంతో స్థానిక చిరునామా పనికి రాదని చెప్పామని, దాంతో రాత్రి విజయవాడ చిరునామా ఇస్తామని చెప్పినట్లు లాడ్జి మేనేజర్ చెబుతున్నాడు.

రాత్రి పూట ఇద్దరు స్త్రీలు, పురుషులు బయటకు వెళ్లిపోయారని, విజయవాడ చిరునామా ఇవ్వలేదని, ఆ మూడు కుటుంబాల అలికిడి కనిపించకపోవడంతో తాము గదుల వద్దకు వెళ్లామని, తాళాలు వేసి ఉన్నాయని, దాంతో కిటికీలోంచి గదిలోకి చూశామని, గదిలో రక్తం మడుగులో ఒక వ్యక్తి పడి ఉన్నాడని, దాంతో పోలీసులకు సమాచారం అందించామని లాడ్జి సిబ్బంది చెబుతున్నారు. ఈ రెండు జంటల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతులను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారిగా అనుమానిస్తున్నారు. వారి వద్ద దుబాయ్ కి చెందిన ఫ్లయిట్ టికెట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X