హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2నుంచి వైయస్ ఆకస్మిక తనిఖీలు

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: వచ్చే నెల 2వ తేదీ నుంచి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై ఆయన శనివారం మంత్రులు, అధికారులతో కలిసి సమీక్ష జరిపారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లోని కరువు పరిస్థితులను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కరవు నివారణకు తీసుకుంటున్న చర్యలను కూడా ఆయన ఆరా తీశారు.

కరవు ఫిర్యాదులు స్వీకరించడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. రైతులకు రుణాల మంజూరు కోసం వెంటనే బ్యాంకర్లను సమావేశ పరచాలని ఆయన ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X