వైయస్ తీరుపై చిరు అసంతృప్తి
పార్టీని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆయన చెప్పారు. ఏజెన్సీల్లో విష జ్వరాలను ప్రజలను వణికిస్తోందని ఆయన అన్నారు. తిరుపతి కోదండరామాలయం స్వామివారి నగల అవకతవకలపై సిబిసిఐడితో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాలను తాకట్టు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాగ్ నివేదిక ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
టెక్కలి ఉప ఎన్నికల్లో సీరియస్ గా పోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజల్లోకి రావడానికి ఇది అవకాశం కల్పించిందని ఆయన చెప్పారు. సీరియస్ గా తీసుకున్నందు వల్లనే శాసనసభా సమావేశాలు ఉన్నా తాను ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఎవరూ పోటీ చేయబోమని ప్రకటిస్తే తాము ఆలోచించి ఉండేవారమని ఆయన చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా మాత్రమే ఆలోచిస్తున్నాయి గాని మానవతా దృక్పథంతో ఆలోచించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.