వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖైదీల విడుదలకు తొలగిన అడ్డంకులు

By Staff
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని ఖైదీల విడుదలకు ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. క్షమాభిక్ష ఖైదీల విడుదలకు సంబంధించిన అంశాన్ని హైకోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలని సూచిస్తూ పిటిషనర్ వేసిన ప్రజా ప్రయోజానాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. సుప్రీంకోర్టు సూచన మేరకు న్యాయవాది సతీష్ తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల వల్ల కరుడు గట్టిన నేరగాళ్లు కూడా విడుదలయ్యే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఖైదీల క్షమాభిక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును సవాల్ చేస్తూ సతీష్ ఆ పిల్ దాఖలు చేశారు.

ప్రభుత్వ ఉత్తర్వుపై రెండు మూడు రోజుల్లో హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తానని సతీష్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. సుప్రీంకోర్టు సూచన మేరకు తాను పిల్ ను ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు. నిజానికి, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష పెడుతూ కొంత మందిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. అయితే సతీష్ ఆ జీవోను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఖైదీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయవచ్చునని, అయితే తుది ఉత్తర్వులకు లోబడి ఖైదీల విడుదల ఉంటుందని, అవసరమైతే విడుదలైన కొంత మంది తీవ్రమైన నేరాగాళ్లను తిరిగి ప్రభుత్వం అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో తెలుపుతూ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. 24వ తేదీన సోమవారం సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X