వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఖైదీల విడుదలకు తొలగిన అడ్డంకులు
ప్రభుత్వ ఉత్తర్వుపై రెండు మూడు రోజుల్లో హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తానని సతీష్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. సుప్రీంకోర్టు సూచన మేరకు తాను పిల్ ను ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు. నిజానికి, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష పెడుతూ కొంత మందిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. అయితే సతీష్ ఆ జీవోను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఖైదీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయవచ్చునని, అయితే తుది ఉత్తర్వులకు లోబడి ఖైదీల విడుదల ఉంటుందని, అవసరమైతే విడుదలైన కొంత మంది తీవ్రమైన నేరాగాళ్లను తిరిగి ప్రభుత్వం అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో తెలుపుతూ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. 24వ తేదీన సోమవారం సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది.
Story first published: Monday, August 24, 2009, 16:11 [IST]