వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిన్నా ఒకప్పుడు సెక్యులరే: సుదర్శన్

By Staff
|
Google Oneindia TeluguNews

Sudharshan
ఇండోర్: మహ్మద్ అలీ జిన్నా ఒకప్పుడు సెక్యులరేనని, అవిభాజిత భారతదేశాన్నే జిన్నా కోరుకుంటున్నాడని ఆర్ ఎస్ ఎస్ మాజీ చీఫ్ కెఎస్ సుదర్శన్ అన్నారు. బహిష్కృత బిజెపి నేత జస్వంత్ సింగ్ వాదనను ఆయన బలపరిచారు. జిన్నా ఒకప్పుడు లోకమాన్య తిలక్ తో ఉన్నాడని, జాతి కోసం జిన్నా పనిచేశాడని చరిత్ర చదివితే అర్థమవుతుందని సుదర్శన్ అన్నారు. గాంధీ ఖలీఫా ఉద్యమం విషయంలో జిన్నా తీవ్ర నిరాశకు గురయ్యారని, తన వాదనను విననందుకు విచారం వ్యక్తం చేశాడని ఆయన వివరించారు.

గాంధీ తన మాట వినకపోవడంతో జిన్నా ఇంగ్లండు వెళ్లిపోయి 1927లో తిరిగి వచ్చాడని ఆయన చెప్పారు. జస్వంత్ సింగ్ ను బిజెపి బహిష్కరించడంపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. అది పార్టీ అంతర్గత వ్యవహారమని ఆయన అన్నారు. జిన్నాపై వ్యాఖ్యలు చేసినందుకు అద్వానీ తర్వాత వివరణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తన వ్యాఖ్యలపై సుదర్శన్ వివరణ ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి రామ్ మాధవ్ డిమాండ్ చేశారు. అరుణ్ శౌరీ వ్యాఖ్యలు బిజెపి అంతర్గత వ్యవహారమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X