వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సయీద్ పై చర్య తీసుకోవాల్సిందే : కృష్ణ

By Staff
|
Google Oneindia TeluguNews

SM Krishna
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, జమాత్ - ఉద్ దావా చీఫ్ హఫీజ్ సయీద్ పై పాకిస్తాన్ చర్య తీసుకోవాల్సిందేనని భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ అన్నారు. ఇంటర్ పోల్ నోటీసు జారీ కావడాన్ని బట్టి ముంబై దాడుల్లో సయీద్ పాత్ర ఉందనే తమ వైఖరి సరైందేనని తేలిపోతోందని ఆయన అన్నారు. తాము సేకరించి అందించిన సాక్ష్యాల ఆధారంగా సయీద్ పై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
సయీద్ పై ఇంటర్ పోల్ నోటీసు జారీ అయిన విషయాన్ని ప్రపంచం గుర్తిస్తుందని, ప్రపంచదేశాలు వాటంతటవే ఒక నిర్ణయానికి వస్తాయని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముంబై దాడులకు పాల్పడినవారిని శిక్షించాల్సిందేనని, ముంబై దాడుల్లో పాల్గొన్నవారికి సంబంధించి తాము ఎంతో శ్రమకోర్చి సాక్ష్యాలు సేకరించామని ఆయన అన్నారు. సయీద్ ను ప్రాసిక్యూట్ చేయడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని పాకిస్తాన్ అనడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X