హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాకేం అభ్యంతరం లేదు: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ఎన్ని ప్రశ్నలకైనా తాము సమాధానం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని, సభా సమయమంతా ఒక ప్రశ్నకే పరిమితం చేద్దామన్నా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం శాసనసభలో దుమారం చెలరేగింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి ఆ విధంగా అన్నారు. అన్ని పక్షాలు అంగీకరిస్తే సభలో ఒక ప్రశ్నతోనే గడుపుదామని ఆయన అన్నారు.

అనుబంధ ప్రశ్నలు వేయడానికి తమకు అవకాశం ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పాయి. మనం కొన్ని పరిమితులు పెట్టుకోవాలని, లేదంటే స్పీకర్ చెప్పినట్లు విని సభను సజావుగా నిర్వహించుకోవాలని ఆయన అన్నారు. సభ్యులు కోరినంత సమయం ఇవ్వాలని ఆయన స్పీకర్ ను కోరారు. ప్రశ్నలు అడగడానికి ఎంత సమయం ఇస్తున్నారో సమాధానం చెప్పడానికి కూడా అంతే సమయం ఇవ్వాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X