హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ ప్రపంచ బ్యాంక్ తొత్తు: సిపిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
హైదరాబాద్: ప్రపంచ బ్యాంక్ మెప్పు పొందేందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయత్నిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు విమర్శించారు. అందుకే జల విధానానికి, భూసంస్కరణల మార్పులకు చట్టబద్ధత కల్పిస్తోందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెసు పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రజలను వంద రకాల బాధలకు గురి చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రపంచ బ్యాంకుకు అనుకూలంగా వ్యవహరించేందుకు గతంలోని భూసంస్కరణల చట్టాలు ప్రస్తుత ప్రభుత్వానికి ఆటంకంగా ఉన్నాయని, అందుకే వాటిని మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న భూములను వైయస్ ఇప్పటికే పెద్దలకు కట్టబెట్టారని, ఇప్పుడు మిగులు భూములను కూడా కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X