వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెహ్రూపై వ్యాఖ్యలు: ప్రణబ్ మండిపాటు

By Staff
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: దేశ విభజన విషయంలో బిజెపి అనుసరిస్తున్న వైఖరిపై కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మండిపడ్డారు. అలీ జిన్నాపై జస్వంత్ సింగ్ రాసిన పుస్తకం నేపథ్యంలో జవహర్ లాల్ నెహ్రూపై బురద చల్లడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. సంకుచితమైన పక్షపాత ప్రయోజనాల కోసం దేశ విభజనకు సంబంధించి నెహ్రూపై బిజెపి వ్యాఖ్యలు చేస్తోందని ఆయన అన్నారు.

అద్వానీ 2005లో జరిపిన పాకిస్తాన్ పర్యటనపై, జస్వంత్ సింగ్ పుస్తకంపై ప్రణబ్ వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశారు. జిన్నాను ఆకాశానికి ఎత్తడం మీద వారి మానసిక పరిస్థితి ఏమిటో చెప్పాలని ఆయన అన్నారు. జిన్నా విభజనకు కారణం కాదని జిన్నా అవిభాజిత భారత్ ను కోరుకున్నారని జస్వంత్ అకస్మాత్తుగా కనిపెట్టారని, చారిత్రకంగా అది నిజం కాదని ఆయన అన్నారు. అది బురజ చల్లడం తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X