తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిటిడి లొల్లిపై వైయస్ సీరియస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలిలో చెలరేగిన వివాదంపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సీరియస్ అయ్యారు. టిటిడి పాలక మండలి చైర్మన్ ఆదికేశవులు నాయుడు, సభ్యుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో టిటిడి పాలక మండలి వ్యవహారం రచ్చకెక్కింది. వారిద్దరు పరస్పరం ఆరోపణలు చేసుకోవడాన్ని ముఖ్యమంత్రి తప్పు పట్టారు. ఎవరూ నోరు మెదపవద్దని ఆయన గురువారం ఆదేశించారు.

తిరుపతి కోదండరామస్వామి ఆలయంలోని నగల తాకట్టు వ్యవహారం ప్రభుత్వానికి మింగుడు పడని వ్యవహారంగా మారింది. ఆలయాల్లో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు సంధించడానికి సిద్ధపడుతున్నాయి. ఈ వ్యవహారం శుక్రవారం శాసనసభలో చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో వైయస్ రాజశేఖరరెడ్డి పాలకమండలి సభ్యులను హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X