వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వసుంధర రాజెకు ఢిల్లీ పిలుపు

By Staff
|
Google Oneindia TeluguNews

Vasundhara Raje
న్యూఢిల్లీ: రాజస్థాన్ శాసనసభ ప్రతిపక్ష నాయకురాలి పదవి నుంచి తప్పుకోవడానికి మొరాయిస్తున్న వసుంధర రాజె సింధియాను బిజెపి నాయకత్వం ఢిల్లీకి రావాలని ఆదేశించింది. ఈ నెల 31వ తేదీన ఢిల్లీకి వచ్చి ఎం. వెంకయ్యనాయుడిని కలవాలని పార్టీ నాయకత్వం ఆమెకు సూచించింది. భవిష్యత్తు కార్యక్రమం కోసం వసుంధర రాజె సోమవారం వెంకయ్యనాయుడిని కలిసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

ప్రతిపక్ష నాయకురాలిగా దిగిపోవాలని పార్టీ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను వసుంధర రాజె ధిక్కరిస్తూ వస్తున్నారు. పైగా రాజస్థాన్ శాసనసభ ఎదుట స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభ్యులతో కలిసి ధర్నా చేశారు. బిజెపి పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికే చేసినట్లు చెప్పుకుంటున్నప్పటికీ పార్టీ నాయకత్వానికి తనకు బలాన్ని తెలియజెప్పే ఉద్దేశంతోనే జరిగిందని భావిస్తున్నారు. దీనిపై పార్టీ నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X