వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై దాడులు అగేవి: పాక్

By Staff
|
Google Oneindia TeluguNews

Hafiz Saeed
ఇస్లామాబాద్: భారత్ తమకు సమాచారం అందించి ఉంటే నవంబర్ లోని ముంబై దాడులు ఆగి ఉండేవని పాకిస్తాన్ ఇంటీరియర్ మంత్రి రెహ్మాన్ మాలిక్ అన్నారు. జమాత్ ఉద్ దావా చీఫ్ హఫీజ్ సయీద్ పై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ అయిన నేపథ్యంలో భారత్ అందించిన సాక్ష్యాలను తాము పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు. నోటీసు విషయంలో కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుందని ఆయన లండన్ లో మీడియా ప్రతినిధులతో అన్నారు.

భారత్ లోనే కాకుండా ఎక్కడైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడడానికి తమ దేశాన్ని వాడుకోవడాన్ని తాము సహించబోమని ఆయన అన్నారు. భారత్ నుంచి తమకు తాజా నివేదిక అందిందని, అది పద్ధతుల పాటింపునకు పనికి వస్తుందా, లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు. ముంబై దాడులపై పాకిస్తాన్ పారదర్శకంగా దర్యాప్తు నిర్వహిస్తోందని ఆయన చెప్పారు. ఐదుగురిని ఈ కేసులో అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. పాక్ నుంచి భారత్ పై ముంబై తరహా దాడులు జరిగే ప్రమాదం ఉందని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇటీవల చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ అందుకు సంబంధించిన సమాచారాన్ని అందివ్వాలని తాము భారత్ ను కోరినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X