హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం వైయస్ తో బొజ్జల భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో సమావేశమయ్యారు. దీంతో ఆయన కాంగ్రెసు పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఒక్కరొక్కరే తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రిని కలవడం తర్వాత వారు కాంగ్రెసులో చేరడం ఒక ఆనవాయితీగా మారిన నేపథ్యంలో బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ముఖ్యమంత్రిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుందని అంటున్నారు.

తాను కాంగ్రెసులో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఖండించారు. తన నియోజకవర్గానికి రెండు ప్రాజెక్టులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆయన తెలిపారు. మర్యాదపూర్వకంగా జరిగిన భేటీని రాజకీయం చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. తన నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి చెప్పిన తర్వాతనే తాను ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆయన తెలిపారు. తాను తెలుగుదేశంలోనే కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు ముఖ్యమంత్రి పేషీ ఆకర్షణకు కేంద్రం కాదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X