హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ నుంచి రామారావు వాకౌట్

By Staff
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం కొవ్వూరు శాసనసభ్యుడు టీవీ రామారావు సోమవారం శాసససభ నుంచి వాకౌట్ చేశారు. రామారావుపై అత్యాచారం కేసు నమోదుపై జరిగిన చర్చకు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. తనపై పెట్టిన కేసులో తనకు కేరాఫ్ ప్లాట్ ఫారంగా మారానని ఆయన అన్నారు. తన వాదన కూడా ఫ్లాట్ పారం మీదే వినిపిస్తానని ఆయన అన్నారు. ప్రభుత్వ వివరణకు ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. నర్సింగ్ విద్యార్థినులు కూడా దళితులే అన్న విషయం ఇప్పుడు ప్రభుత్వానికి గుర్తుకు వచ్చిందా అని ఆయన అడిగారు.

సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. రామారావుపై తగిన సాక్ష్యాధారాలు ఉండడం వల్లనే కేసు నమోదు చేసినట్లు సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. దళిత శాసనసభ్యుడు రామారావును వేధిస్తోందని అంటున్నారని, రామారావుపై ఫిర్యాదు చేసిన ఐదుగురు నర్సింగ్ విద్యార్థినుల్లో నలుగురు దళితులేనని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X