హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమ ప్రాజెక్టులపై వాడిగా చర్చ

By Staff
|
Google Oneindia TeluguNews

Ponnala Laxmaiah
హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులపై కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులపై శాసనసభలో మంగళవారం వాడిగా వేడిగా చర్చ జరిగింది. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ విమర్శించిది. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించింది. ఈ సమయంలో కాంగ్రెసు, తెలుగుదేశం సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది.

భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం సభ్యులు నిరసన తెలిపారు. కర్నాటక, మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులను నిరోధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సభలో తీర్మానం ప్రతిపాదించారు. పొరుగు రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఈ విషయంపై అఖిళ పక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకుని వెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X