వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరువు నివారణకు చర్యలు: ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: కరవు నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటామని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సిగ్ హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కరవుపై అతిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మరో రెండేళ్లలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని ఆయన చెప్పారు. ప్రణాళికా సంఘం సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆర్థిక మాంద్యం నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడి్ప్పుడే కుదురుకుంటున్నాయని ఆయన అన్నారు. కొద్ది నెలల్లో పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రుతు పవనాలు సరిగా లేకపోవడాన్ని కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ ప్రభుత్వ హయాంలో ఇది ప్రణాళికా సంఘం తొలి సమావేశం. ఈ సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, వ్యవసాయ మంత్రి శరద్ పవార్ పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X