హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిప్పు లేనిదే పొగ రాదు: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: నిప్పు లేనిదే పొగ రాదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. తెలుగుదేశం నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరుతారని వస్తున్న వార్తలపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. దీనిపై తెలుగుదేశం చేస్తున్న విమర్శలు అర్థరహితమని ఆయన అన్నారు. మంగళవారం ఉదయం ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తమ కాంగ్రెసు పార్టీలోకి ఎవరిని బడితే వారిని తీసుకోబోమని ఆయన అన్నారు. పార్టీలో చేర్చుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తామని ఆయన చెప్చారు. బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిని కలిశారు. దీంతో ఆయన కాంగ్రెసులో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాను ఆ వార్తలను గోపాలకృష్ణా రెడ్డి ఖండించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X