హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం నిజంగా మిస్సింగే: రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్‌ ఆచూకి ఇంకా దొరక లేదని ఆర్థిక మంత్రి రోశయ్య ప్రకటించారు. సిఎం సేఫ్‌ గా ఉన్నారని, సిఎం ఉన్న ప్రాంతాన్ని కనుగొన్నామని కేంద్ర సివిల్‌ ఏవియేషన్‌ శాఖ ప్రకటించిన కొద్ది సేపటికే రోశయ్య ఈ ప్రకటన చేయడంతో మళ్లీ అంతా ఉత్కంఠ నెలకొంది.

అయితే..హెలికాప్టర్‌ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో సురక్షితంగా ల్యాండయినట్లు సమచారం అందిందని, సిఎం సేఫ్‌ గానే ఉండిఉంటారని రోశయ్య చెప్పారు. కాని..దట్టమైన అడవి..దానికి తోడు కుండపోత వర్షం..హెలికాప్టర్‌ ల్యాండయిన ప్రాంతాన్ని కనుక్కొవడం కష్టంగా మారిందని ఆయన వెల్లడించారు. చీకటి పడేలోగా సిఎం ఆచూకీ కనుగొనాలని రోశయ్య అధికారులను ఆదేశించారు. అడవి చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహకారంతో సిఎం జాడ కనుగొనమని అధికారులకు రోశయ్య సూచించారు. సిఎం ఆచూకి కోసం నాలుగు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరుకు భారీ సంఖ్యలో పోలీసుల బలగాలు చేరాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X