వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వైన్ ఫ్లూతో టెక్కీ మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్: కర్నాటక రాజధాని బెంగుళూర్ లో 31 ఏళ్ల సాప్ట్ వేర్ ఇంజినీర్ స్వైన్ ఫ్లూ వ్యాధితో మరణించాడు. అధికారులు బుధవారం ఉదయం ఆ విషయం చెప్పారు. దీంతో కర్నాటకలో స్వైన్ ఫ్లూతో మరణించినవారి సంఖ్య 28కి చేరుకుంది. తమిళనాడుకు చెందిన ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బెంగుళూర్ లోని అమెరికాకు చెందిన ప్రముఖ ఐటి కంపెనీలో పని చేస్తున్నాడు. అతను నగరంలో లేక్ సైడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు.

వారం రోజుల క్రితం న్యుమోనియా లక్షణాలతో అతను ఆస్పత్రిలో చేరాడు. అయితే స్వైన్ వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడంతో టామీ ఫ్లూ ఇచ్చి, వెంటిలేటర్ పై ఉంచినట్లు, అతను మంగళవారం రాత్రి మరణించినట్లు లేక్ సైడ్ ఆస్పత్రి డైరెక్టర్ హెచ్ పరమేశ్ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X