చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ క్షేమం: ప్రఫుల్ ధృవీకరణ

By Staff
|
Google Oneindia TeluguNews

Praful Patel
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి క్షేమంగా ఉన్నట్లు పౌర విమానయానాల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ ధృవీకరించారు. అయితే, వైయస్ ప్రయాణించిన హెలికాప్టర్ క్షేమంగా ఉన్నట్లు ధృవీకరించినప్పటికీ ఆ హెలికాప్టర్ ఎక్కడ దిగిందనే విషయాన్ని, ఇతర వివరాలను ఆయన వెల్లడించలేదు. భద్రతా కారణాల రీత్యానే ఆయన ఆ వివరాలు అందించలేదని తెలుస్తోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ కార్యాలయం అధికారులు కూడా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, పౌర విమాన యాన శాఖ అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ముఖ్యమంత్రి క్షేమసమాచారాలపై ఆరా తీశారు.

ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సుబ్రహ్మణ్యంతో పాటు చీఫ్ భద్రతాధికారి వెస్లీ, మరో ఇద్దరు పైలట్లు ఉన్నారు. కొద్ది సేపట్లో ముఖ్యమంత్రి హైదరాబాదుకు బయలుదేరుతున్నారు. రోడ్డు మార్గంలో చిత్తూరుకు చేరుకుంటారని కూడా ఒక అధికారి అంటున్నారు. హెలికాప్టర్ దిగిన ప్రదేశం నుంచి ముఖ్యమంత్రి కొంత దూరం కాలినడకన ప్రయాణించి ఒక గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం మీద ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారనే వార్తతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X