వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారేం ఇచ్చారో చెప్తారా: రోజా

By Staff
|
Google Oneindia TeluguNews

Roja
కర్నూలు: తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు తనకు ఏమిచ్చారో చెప్తారా అని తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా తనపై విమర్శలు చేస్తున్న పార్టీ నాయకులను ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసులో చేరుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఒక టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. తనకు అప్పట్లో కోటి రూపాయల ఆదాయం ఉండేదని, దాన్ని వదులుకుని తెలుగుదేశం పార్టీలో చేరానని, చంద్రబాబు నాయుడు పాలనా దక్షత నచ్చి తాను తెలుగుదేశం పార్టీలో చేరానని ఆమె చెప్పారు. పార్టీలో చేరిన తర్వాత చాలా నిబద్ధతతో పని చేశానని ఆమె చెప్పుకున్నారు.

కాంగ్రెసు పార్టీ ప్రలోభాలకు తాను లొంగిపోయినట్లు వస్తున్న విమర్శలను ఆమె ఖండించారు. అటువంటి వ్యాఖ్యలు తనకు బాధ కలిగిస్తున్నాయని, పైగా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోయి తిరిగి పార్టీలోకి వచ్చినవారు తనపై విమర్సలు చేస్తున్నారని ఆమె అన్నారు. తాను ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదని, త్వరలోనే వెల్లడిస్తానని రోజా చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనకు శత్రువులు పెరిగారని ఆమె అన్నారు. రాజకీయాలు, సినిమా తనకు రెండు కళ్లలాంటివని ఆమె చెప్పుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X