హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'రాములమ్మను తరిమి కొడ్తాం'

By Staff
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
హైదరాబాద్: తమ పార్టీ జెండాపై, తెలంగాణవాదంపై గెలిచి తెలంగాణా వాదానికి ద్రోహం చేసిన పార్లమెంటు సభ్యురాలు విజయశాంతిని తరిమి కొట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రజలకు పిలుపునిచ్చింది. పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు అధ్యక్షతన మంగళవారం సాయంత్రం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో విజయశాంతి వ్యవహారంపై చర్చించారు. కాంగ్రెసుతో విజయశాంతి కుమ్మక్కయ్యారని, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తొత్తుగా మారారని సమావేశంలో విమర్శించారు. అటువంటి విజయశాంతిని మహిళలు, తెలంగాణవాదులు తరిమి తరిమి కొడతారని అంటూ సమావేశం తీర్మానం చేసింది.

విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కాంగ్రెసు నాయకులతో కలిసి నియోజకవర్గంలో పర్యటించడాన్ని తెరాస తీవ్రంగా పరిగణించింది. ఆమె తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా వ్యతిరేకించాలని పార్టీ నిర్ణయించింది. ఇకపై పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా పార్టీ నిర్ణయించింది. కార్యవర్గ సమావేశం వివరాలను కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కళ్లెం యాదగిరి రెడ్డి, మధుసూదనాచారి, రాములు నాయక్ మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X