హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంచి మిత్రుడ్ని కోల్పోయా: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్:రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో తాను మంచి మిత్రుడ్ని కోల్పోయానని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైయస్ మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని ఆయన అన్నారు. హెలికాప్టర్ అదృశ్యం గురించి తెలిసిన వెంటనే వైయస్ ఏదో విధంగా బయట పడతారనే నమ్మకంతో ఇప్పటి వరకు ఉన్నానని ఆయన అన్నారు. చంద్రబాబు గురువారం ఉదయం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చి వైయస్ కుటుంబ సభ్యులను పరామర్సించారు.

రాష్ట్రానికి ఎంతో మేలు చేయాలని వైయస్ రాజశేఖర రెడ్డి కలలు కన్నారని ఆయన ప్రశంసించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపిస్తున్న వైయస్ పై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని ఆయన అన్నారు. ఆయన మరణం కుటుంబానికి, కాంగ్రెసు పార్టీకి తీరని లోటు అని చంద్రబాబు అన్నారు. వైయస్ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన ముఖ్యమంత్రికి, ఇతరులకు ఆయన సంతాపం ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X