హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సచివాలయంలో కేంద్ర మంత్రుల సమీక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

Jaipal Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ ఆచూకీ లభ్యం కావడంతో కేంద్ర మంత్రులు ఎస్ జైపాల్ రెడ్డి, వీరప్ప మొయిలీ, పృథ్వీరాజ్ చవాన్ రాష్ట్ర సచివాలయం నుంచి పరిస్థితి సమీక్షిస్తున్నారు. వారు బుధవారం రాత్రి రాష్ట్రానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి క్షేమంగా ఉంటారని వారంతా ఆశిస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు, మంత్రులు కూడా సచివాలయానికి చేరుకున్నారు. అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నారు.

ఢిల్లీలోని ఎఐసిసి వర్గాలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి పరిస్థితిపై ఆరా తీస్తున్నాయి. రాష్ట్ర అధికారులతో వారు క్షణక్షణం సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. హెలికాప్టర్ ఆచూకీ తెలిసిందనే సమాచారం అందడంతో కాంగ్రెసు కార్యకర్తలు పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కు చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X