హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాక్షికి వైయస్ చివరి ఇంటర్వ్యూ

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekha Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చివరిసారి తన కుమారుడు వైయన్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని సాక్షి దినపత్రిక, టీవీ చానెల్ తోనే చివరిసారిగా మాట్లాడారు. బుధవారం ఉదయం చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరే ముందు ఆయన హైదరాబాదులో సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. చిత్తూరు జిల్లా అనుపల్లి గ్రామంలో ఆయన రచ్చబండ కార్యక్రమానికి ప్రారంభించాల్సి ఉంది. సాక్షి టీవీ చానెల్ ప్రతినిధితో బుధవారం ఉదయం తన రచ్చబండ కార్యక్రమ ఉద్దేశ్యాలను వెల్లడించారు. పల్లె జనంతో మాట కలుపుతానంటూ ఆయన చెప్పారు.

తాను ఎవరికీ చెప్పకుండా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తానని, ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. తాను ఏ గ్రామానికి వస్తానో ముందే చెబితే అక్కడి అధికారులు జాగ్రత్త పడి లోపాలు సరిదిద్దుతారని, అందువల్ల పర్యటన రోజు ఉదయం మాత్రమే తాను ఏ గ్రామానికి వెళ్లేది తెలియజేస్తానని ఆయన చెప్పారు. గ్రామాల్లో ప్రజలతో నేరుగా సమావేశమవుతానని ఆయన చెప్పారు. గ్రామాల్లో సరఫరా వ్యవస్థలు సరిగా పని చేస్తున్నాయా లేదా స్వయంగా చూస్తానని ఆయన చెప్పారు. కరవు సమస్యలపై కూడా వాకబు చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 20 వేల గ్రామాల్లో పర్యటించడం సాధ్యం కాదు కాబట్టి నెలకు రెండు మూడు రోజులు మూడు నాలుగు గ్రామాలకు వెళ్తానని, దీనివల్ల గ్రామాల్లో సమస్యలేమిటనేవి తెలుస్తాయని, వాటిని సరిదిద్దడానికి తగిన చర్యలు తీసుకోవడానికి వీలు అవుతుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X