హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ రాజశేఖర రెడ్డి ఇక లేరు

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఇక లేరు. కడప పులి రాజశేఖర రెడ్డి కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు సమీపంలో కొండపై జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయనతో పాటు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జాన్ వెస్లీ, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సుబ్రహ్మణం, పైలట్లు భాటియా, ఎంఎస్ రెడ్డి కూడా దుర్మరణం పాలయ్యారు. ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి బుధవారం ఉదయం 8 గంటల 35 నిమిషాల ప్రాంతంలో బయలుదేరారు. ఉదయం 9 గంటల2 నిమిషాల ప్రాంతంలో హెలికాప్టర్ నుంచి లింక్ తెగిపోయింది. హెలికాప్టర్ అదృశ్యమైన 24 గంటల తర్వాత ముఖ్యమంత్రి ప్రయాణించిన హెలికాప్టర్ ఆచూకీ లభ్యమైంది.

వైయస్ మృతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి మరణవార్త తెలిసిన వెంటనే సచివాయంలోనూ, కాంగ్రెసు రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ లోనూ విషాద వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా విషాద వాతావరణం నెలకొంది. వైయస్ మరణ వార్తను జీర్ణించుకోలేని అభిమానులు, పార్టీ కార్యకర్తలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ నుంచి ఒక లేఖను జారవిడిచినట్లు సమాచారం. క్రమక్రమంగా వస్తున్న వార్తలు ఆయన ప్రాణాలతో ఉండడం కష్టమేనని తెలియజేస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X