వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ కు అద్వానీ నివాళి

By Staff
|
Google Oneindia TeluguNews

LK Advani
హైదరాబాద్: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీ నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం ఆయన హైదరాబాదులోని ఎల్బీ స్టేడియానికి చేరుకుని వైయస్ భౌతిక కాయంపై పుష్పమాల ఉంచి నివాళులు అర్పించారు. ఆయన వెంట బిజెపి సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు ఉన్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఎల్బీ స్టేడియంలో వైయస్ కు నివాళులు అర్పించారు.

మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వైయస్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సిపిఎం నాయకుడు బివి రాఘవులు, తదితర పార్టీల నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. వైయస్ భౌతిక కాయం పులివెందులకు తీసుకుని వెళ్లడానికి బేగంపేట విమానాశ్రయానికి చేరుతోంది. కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాగ్, తదితరులు ఇడుపులపాయకు బయలుదేరుతున్నారు.

వైయస్ కుటుంబ సభ్యులు ఇప్పటికే హైదరాబాదు నుంచి ఇడుపులపాయకు బయలుదేరారు. ఇడుపులపాయకు ఎనిమిది హెలికాప్టర్లు వెళ్తున్నాయి. వైయస్ భౌతిక కాయాన్ని ప్రత్యేకమైన శవపేటికలో ఉంచి సైనిక హెలికాప్టర్ లో బేగంపేట విమానాశ్రయం నుంచి పులివెందులకు తరలిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X