వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాసుమతి రైస్ కు కసబ్ మారాం

By Staff
|
Google Oneindia TeluguNews

Kasab
ముంబై: జైలులో తనకు బాసుమతి బియ్యం అన్నం కావాలని ముంబై దాడుల నిందితుడు అజ్మల్ కసబ్ కోరాడు. అతను బాసుమతి బియ్యం అన్నంతో పాటు స్పైసీ ఫుడ్ కూడా అడుగుతున్నాడు. అడిగిన ఆహారం అందించకపోతే అతను జైలు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట. వారిని తిడుతున్నాడట. ఆర్థర్ జైల్లో ఉంటున్న కసబ్ ఇంతకు ముందు మటన్ బిర్యానీ కోసం పట్టుబట్టాడు. జైలు సూపరింటిండెంట్ రాజేంద్ర దామ్నే సోమవారం ఈ విషయం చెప్పారు.

తాను అడిగింది ఇవ్వకపోతే మారాం చేస్తున్నాడని, ఆహారం తినని మొండికేస్తున్నాడని, సమయానికి బట్టలు మార్చుకోవడం లేదని ఆయన చెప్పారు. కసబ్ ఈ విషయాలపై జైలు అధికారులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. అందరి ఖైదీలకు మాదిరిగానే నిర్దేశించినట్లు కసబ్ కు కూడా ఆహారం అందిస్తున్నామని దామ్నే చెప్పారు. కసబ్ సెల్ లో కెమెరా ను ఫిట్ చేశారు. అతని కదలికలను అది రికార్డు చేస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X