హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పురంధేశ్వరి సరి రారు: నేదురుమల్లి

By Staff
|
Google Oneindia TeluguNews

Nedurumalli Janardhana Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికే అప్పగించాలని మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అన్నారు. రాజశేఖర రెడ్డి లేని లోటును ఆయన కుమారుడు జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా పూడ్చుకోవాలని జనార్దన్ రెడ్డి అన్నారు. వైయస్ ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావు అండతో జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనేది తన ఉద్దేశమని ఆయన ఆదివారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో చెప్పారు. దీనిపై కెవిపిని అధిష్ఠానవర్గం మాట్లాడితే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగించి, జగన్ ను కేంద్రంలో మంత్రిగా చేయడమంటే రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని పక్కన పెట్టడమేనని ఆయన అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే ప్రజలు అంగీకరించరని ఆయన అన్నారు. పురంధేశ్వరిని ముఖ్యమంత్రి పదవికి ముందుకు తేవడం ఇప్పుడు సరైంది కాదని ఆయన అన్నారు. రాజశేఖర రెడ్డి అంత్యక్రియల్లో లోపాలు జరిగాయని, ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X