వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదాల్లాగా పైలట్లు: నరేష్ గోయల్

By Staff
|
Google Oneindia TeluguNews

Naresh Goyal
ముంబై: ఉగ్రవాదుల్లాగా వ్యవహరిస్తే పైలట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జెట్ ఎయిర్ వేస్ చైర్మన్ నరేష్ గోయల్ అన్నారు. బొంబాయి హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ పైలట్లు బుధవారం కూడా తమ సమ్మెను కొనసాగించారు. పైలట్లు ఉగ్రవాదుల్లాగా ప్రవర్తిస్తున్నారని, దేశాన్ని, ప్రయాణికులను వారు ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు. పైలట్ల సమ్మెతో జెట్ ఎయిర్ వేస్ బుధవారంనాడు 170 విమానాలను రద్దు చేసింది.

తాను పైలట్లతో సమావేశమై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన నరేష్ గోయల్ తెలిపారు. పైలట్లు ప్రయాణికులను వేధించడం సరికాదని ఆయన అన్నారు. పైలట్ల బ్లాక్ మెయిల్ వ్యవహారాన్ని సహించబోమని, వారి వల్ల జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 30 వేల మంది ఉద్యోగుల ఉపాధి కూడా ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. పైలట్లు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సమస్య పరిష్కారానికి తాము బుధవారం యాజమాన్యాన్ని కలుస్తామని నేషనల్ ఏవియేటర్ గిల్డ్ అధ్యక్షుడు కెప్టెన్ గిరీష్ కౌశిక్ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X