వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొన్ని విషయాలు తెలిశాయి: త్యాగి

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
కర్నూలు: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై త్వరలో నివేదిక సమర్పిస్తామని పౌర విమాన యానాల డైరెక్టర్ జనరల్ త్యాగి చెప్పారు. త్యాగితో పాటు డిజిసిఎ నిపుణులు గురువారం కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లోని సంఘటనా స్థలాన్ని సందర్శించారు. రెండు వారాల్లో మరోసారి సంఘటనా స్థలాన్ని సందర్శించి నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. ప్రమాదం పూర్తి మ్యాప్ ను తాము తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం సముద్ర మట్టానికి 355 కిలోమీటర్ల ఎత్తులో జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. సంఘటనకు సంబంధించి స్థానిక ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాక్ పిట్ వాయిస్ రికార్డు ను ఢిల్లీలో డీకోడ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమకు కీలకమైన ఆధారాలు లభించాయని ఆయన చెప్పారు. కాక్ పిట్ వాయిస్ రికార్డు ద్వారా కొన్ని విషయాలు తెలిశాయని, దాన్ని అధికారికంగా ధృవీకరించిన తర్వాతనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. సంఘటనా స్థలానికి సంబంధించిన ఫొటోలు, వీడియోను డిజిసిఎ బృందం తీసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X