హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్లక్ష్యానికి వైయస్ బలి: కోటగిరి

By Staff
|
Google Oneindia TeluguNews

Kotagiri Vidyadhar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్లక్ష్యానికే వైయస్ రాజశేఖర రెడ్డి బలయ్యారని ప్రజారాజ్యం పార్టీ నేత కోటగిరి విద్యాధరరావు ఆరోపించారు. అర్హత లేని పైలట్లను ఎందుకు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ నడపడానికి వినియోగించారో అధికారులు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పైలట్ భాటియా, ప్రధాన భద్రతాధికారి వెస్లీ ప్రమాదానికి కారకులని ఆయన ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు జరిపిస్తే వైయస్ హెలికాప్టర్ ప్రమాదానికి గల నిజాలు బయటపడతాయని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

భాటియాకు ఎటిపి లైసెన్స్ లేదని, అయినా భాటియాను హెలికాప్టర్ నడపడానికి వినియోగించారని, ఒక మంత్రి సిఫార్సు మేరకే భాటియా పదవీ కాలాన్ని పొడిగించారని ఆయన అన్నారు. భాటియా వ్యవహారంపై సిఐడి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X