వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడో రోజూ జెట్ పైలట్ల సమ్మె

By Staff
|
Google Oneindia TeluguNews

Naresh Goyal
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్ వేస్ పైలట్ల సమ్మె వరుసగా మూడో రోజు గురువారం కూడా కొనసాగుతోంది. దీంతో గురువారం దాదాపు 150 విమానాలు రద్దయ్యాయి. జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యానికి, పైలట్లకు మధ్య జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో పైలట్లు గురువారం కూడా సమ్మెను కొనసాగిస్తుననారు. పైలట్లు టెర్రరిస్టుల్లాగా వ్యవహరిస్తున్నారని, పనికి హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జెట్ ఎయిర్ వేస్ చైర్మన్ నరేష్ గోయల్ బుధవారంనాడు అన్నారు.

నరేష్ గోయల్ బుధవారం పౌర విమాన యానాల మంత్రి ప్రఫుల్ పటేల్ తో భేటీ అయ్యారు. అయితే జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు. సంస్థ తన సొంతంగానే సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అయితే ప్రయాణికుల ఇబ్బందులు మంగళవారంతో పోలిస్తే బుధవారం కొంత తగ్గాయి. పైలట్లపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని జెట్ ఎయిర్ వేస్ బొంబాయి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గిల్డ్ కు నోటీసు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X