వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఇష్యూ: జైపాల్ నో కామెంట్

By Staff
|
Google Oneindia TeluguNews

Jaipal Reddy
న్యూఢిల్లీ: వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే అంశంపై మీడియాతో మాట్లడడానికి కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి నిరాకరించారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు శుక్రవారంనాడు జైపాల్ రెడ్డిని కలిశారు. వైయస్ జగన్ ను ఆయన వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ కు మద్దతు తెలుపుతున్న రాష్ట్ర ఎంపీలు జైపాల్ రెడ్డిని కలిశారు. రాష్ట్ర ఎంపిలు తనతో పరిస్థితిని సమీక్షించారని మాత్రమే జైపాల్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముఖ్యమంత్రి వ్యవహారంపై తాను మాట్లాడేది ఏమీ లేదని అన్నారు. మీడియా ప్రతినిధులు చుట్టుముట్టిన ఆయనను ప్రశ్నలతో ముంచెత్తారు. అయినా ఆయన మాట్లడడానికి నిరాకరించారు.

తాను ముఖ్యమంత్రి రేసులో లేనని జైపాల్ రెడ్డి తమతో చెప్పినట్లు రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ చెప్పారు. జైపాల్ తో భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జైపాల్ రెడ్డి జాతీయ రాజకీయాల్లోనే ఉండాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తాను మీడియాకు చెప్పేది కూడా ఏమీ లేదని జైపాల్ రెడ్డి ఎంపిలతో అన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేసులో జైపాల్ రెడ్డి కూడా ఉన్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X