వారా నాకు సాటి?: రోజా
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఆశయాల సాధన కోసం తాను పనిచేస్తానని రోజా అన్నారు. పార్టీ కార్యకర్తలా పనిచేస్తానని ఆమె చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను కాంగ్రెసు పార్టీలో కొనసాగుతానని ఆమె చెప్పారు. తాను కాంగ్రెసులోకి రాకుండా కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతితో రాష్ట్రమంతా తల్లడిల్లిపోయిందని ఆమె అన్నారు. కుటుంబ పెద్ద మరణిస్తే ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో రాష్ట్రం పడిందని ఆమె అన్నారు. తనను గౌరవించి వైయన్ పార్టీలోకి ఆహ్వానించారని, వైయస్ లేరని చెప్పి తాను స్వార్థంతో తాను తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లబోనని ఆమె చెప్పారు.
తనపై అభిమానంతో వైయస్ తనను కాంగ్రెసు పార్టీలోకి ఆహ్వానించారని, దాంతో తాను రాజకీయ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించలేదని రోజా చెప్పారు. తాను ఎటువంటి పదవులూ ఆశించలేదని, కార్యకర్తగానే పార్టీలో పని చేస్తానని, పార్టీ విస్తృతికి కృషి చేస్తానని ఆమె అన్నారు. ప్రజా మద్దతు ఉన్న వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే సమంజసంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.