అక్రమ భూ వివాదంలో విజయశాంతి
వివరాల్లోకి వెళ్తే - 2004లో హౌసింగ్ సొసైటీ ఏర్పడింది. ఇందులో 1400 మంది సభ్యులు చేరారు. ావరు 1200 రూపాయలేసి చెల్లించారు. వారికి అమీర్ పూర్ వద్ద 140 ఎకరాల స్థలం చూపించారు. అయితే అది రింగ్ రోడ్డులో పోయింది. ఈ సమయంలో దాదాపు 2 కోట్ల రూపాయలు సొసైటీ ఖాతా నుంచి నరేష్ అగర్వాల్ కు చెందిన పంజాబ్ ఖాతాలోకి మళ్లింది. అక్కడి నుంచి కోటీ 80 లక్షల రూపాయలు విజయశాంతి భర్తగా చెబుతున్న శ్రీనివాస ప్రసాద్ ఖాతాలోకి వెళ్లాయి. శ్రీనివాస ప్రసాద్ ఖాతాలోకి రెండున్నర కోట్ల రూపాయలు మళ్లాయి. దీంతో వివాదం మొదలైంది. ఈ వివాదంతో 600 మంది సభ్యులకు తిరిగి సొమ్ము చెల్లించారు. కాంగ్రెసు శాసనసభ్యుల సహకారంతో విజయశాంతి ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలుగుదేశం సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Story first published: Saturday, September 12, 2009, 15:18 [IST]