వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెట్ పైలట్ల సమ్మె విమరణ

By Staff
|
Google Oneindia TeluguNews

Jet Air Lines
న్యూడిల్లీ: జెట్ ఎయిర్ వైస్ ఐదు రోజుల సమ్మెకు శనివారం రాత్రి తెర పడింది. జెట్ ఎయిర్ వేస్ పైలట్లకు, యాజమాన్యానికి మధ్య శనివారం రాత్రి అవగాహన కుదిరింది. తమ సహోద్యోగుల ఉద్వాసనను నిరసిస్తూ మంగళవారం నుంచి పైలట్లు సమ్మె చేస్తున్నారు. దాదాపు పది గంటల చర్చల అనంతరం ఇరు వర్గాల మధ్య ఒక అవగాహన కుదిరింది. అంతర్జాతీయ విమానాలు వెంటనే ప్రారంభమవుతాయని, దేశీయ విమానాల రాకపోకలు ఆదివారం సాధారణ స్థితికి వస్తాయని జెట్ ఎయిర్ వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరోజ్ దత్తా చెప్పారు.

యాజమాన్యం ఉద్వాసన పలికిన నలుగురు పైలట్లను తిరిగి తీసుకోవడానికి అంగీకరించిందని పైలట్ల యూనియన్ నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ నాయకుడు సాం థామస్ చెప్పారు. ఇతర సమస్యలపై చర్చకు సంప్రదింపుల గ్రూప్ ను ఏర్పాటు చేస్తారు. ఐదు రోజుల సమ్మె వల్ల సంభవించిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదని సరోజ్ దత్తా చెప్పారు. జెట్ ఎయిర్ వేస్ రెవెన్యూ గణనీయంగా తగ్గింది. ప్రయాణికుల సంఖ్య 23 వేల నుంచి 7,500కు పడిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X