శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గెలుపు సంతోషకరం: రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కాంగ్రెసు విజయం సంతోషకరమని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. కేంద్రంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కార్యక్రమాలను, రాష్ట్రంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి నాయకత్వాన్ని గుర్తించి ప్రజలు టెక్కలిలో కాంగ్రెసు విజయం చేకూర్చి పెట్టారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ గెలుపు తర్వాత అక్కడి కాంగ్రెసు నాయకత్వంపై బాధ్యత పెరిగిందని, వైయస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవారని, ప్రస్తుత నాయకులు కూడా అందుకు అనుగుణంగా వ్యవహరించడం మంచిదని, వైయస్ చెప్పినట్లు విశ్వసనీయతను పెంపొందించుకోవాలని ఆయన అన్నారు.

తనకు ఉత్తరాంధ్ర చాలా కాలం నుంచి తెలుసునని, మంత్రి ధర్మాన పుట్టక ముందు నుంచి తనకు ఆ ప్రాంతంతో అనుబంధం ఉందని, మొదటి నుంచీ ఈ ప్రాంతం కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉంటూ వచ్చిందని, అయితే క్రమంగా పరిస్థితి మారుతోందని, కాంగ్రెసుపై ప్రజల అభిమానం పెరుగుతోందని ఆయన చెప్పారు. వైయస్ మృతి తర్వాత ప్రజలు టెక్కలిలో కాంగ్రెసుకు పట్టం కట్టారని ఆయన అన్నారు. విజయానికి కృషి చేసిన జిల్లా కాంగ్రెసు నాయకత్వాన్ని, కార్యకర్తలను, మంత్రులను ఆయన అభినందించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X