శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ కే కొత్త ఎమ్మెల్యే ఓటు

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
హైదరాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి శాసనసభకు ఎన్నికైన కొర్ల భారతి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేరాలంటే జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం మంచిదని ఆమె అన్నారు. ఆమె మంగళవారం వైయస్ జగన్ ను, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను కలిశారు. జగన్ ను కలిసిన తర్వాత ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని తాను మనసారా కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల తాను ప్రజల ముందుకు వచ్చానని, నీ భర్త ఆశయాలు నెరవేర్చడానికి కృషి చేయాలని వైయస్ తనతో చెప్పారని, ఇప్పుడు జగన్ తో మాట్లాడుతుంటే కూడా వైయస్ చెప్పినట్లే చెప్పారని ఆమె అన్నారు. జగన్ తనకు ఎంతో ధైర్యం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని తన నియోజక వర్గం ప్రజలు కోరుకుంటున్నారని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X