వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కోసం ఎమ్మెల్యేపై ఒత్తిడి

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jagan
అనంతపురం: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెసు కార్యకర్తలు బుధవారం అనంతపురం శాసనభ్యుడు గుర్నాథ్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి ఇళ్లను ముట్టడించారు. వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రం గల ప్లకార్డులు ధరించి వారు ధర్నాకు దిగారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ అధిష్ఠాన వర్గంపై ఒత్తిడి తేవాలని వారు డిమాండ్ చేశారు.

జగన్ అభిమానులు, కాంగ్రెసు అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్ యుఐ కార్యకర్తలు కూడా ధర్నాలు చేశారు. వైయస్ చలువతో గెలిచిన ప్రజాప్రతినిధులు జగన్ కోసం అవసరమైతే రాజీనామాలు చేయాలని వారు అభిప్రాయపడ్డారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు ఆందోళనలు చేస్తామని వారు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X