హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్థానిక సంస్థల పోలింగ్ ఉద్రిక్తతలు

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంపిటీసి, జడ్పీటిసి స్థానాలకు, మున్సిపాలిటీ, కార్పోరేషన్ల వార్డులకు బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 17 ఎంపిటిసీ, 18 జడ్పీటిసి స్థానాలకు, 15 మున్సిపాలిటీ వార్డులకు, ఐదు కార్పోరేషన్లలో ఒక్కో డివిజన్ కు పోలింగ్ జరుగుతోంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 19వ తేదీన జరుగుతుంది. ఈ ఎన్నికలు ఈ నెల 8వ తేదీన జరగాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. దీంతో ఈ ఎన్నికలను బుధవారానికి వాయిదా వేశారు.

కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట జడ్పీటిసి ఉన ఎన్నికలను 11వ వార్డు ప్రజలు బహిష్కరించారు. మంచినీరు, డ్రైనేజీ వసతులు లేవంటూ మహిళలు ఓటు వేయడానికి నిరాకరించారు. కరీంనగర్ జెడ్పిటీసి ఉప ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి పేట మండలం గర్జనపల్లిలో శాసనసభ్యుడు రామారావు, కెడిసిసిబి చైర్మన్ రవీంద్ర రావు మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఘర్షణ జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X