వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సొహ్రబుద్దీన్ కేసు: ఎపి పోలీసులు?
గుజరాత్ ప్రభుత్వం దర్యాప్తు నిజాయితీగా జరగలేదని, పైగా చాలా వాస్తవాలను మిస్టరీగానే మిగిల్చిందని ఆయన అన్నారు. ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించడమే పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ లో గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ పోలీసుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయని, ఈ ఆరోపణలకు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులో ఏ విధమైన సమాధానం లేదని ఆయన అన్నారు. హైదరాబాదు నుంచి సాంగ్లీకి లగ్జరీ బస్సులో వస్తుండగా మధ్యలో సొహ్రబుద్దీన్ ను, అతని భార్య కౌసర్ బీని పోలీసులు పట్టుకున్నారని, వారితో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారని, అయితే అతను ఎవరనేది ఇప్పటి వరకు ధృవీకరించలేదని ఆయన అన్నారు. అతను కలీముద్దీనా,తులసీరాం ప్రజాపతియా అనేది తేల్చలేదని ఆయన అన్నారు.
Comments
Story first published: Thursday, September 17, 2009, 9:25 [IST]