హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుండె తరుక్కుపోతోంది: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: నిజాం పాలనలో పడిన బాధలను స్వాతంత్ర్య సమరయోధుల నుంచి వింటుంటే గుండె తరుక్కుపోతోందని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేయడానికి బదులు రాజకీయాలు అన్యాయం చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం కాకుండా పార్టీలు రాజకీయ లబ్ధి కోసం పని చేస్తున్నాయని ఆయన విమర్శించారు. రాజకీయంగా మార్పు రావాలని స్వాతంత్ర్య సమరయోధులు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.

చరిత్ర అంతరించిపోకూడదని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు చరిత్రలో నిలిచిపోవాలని ఆయన అన్నారు. మనం చాలా అదృష్టవంతులమని, స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామని ఆయన అన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నారని, ఆ మార్పు కోసమే తాము రాజకీయాల్లోకి వచ్చామని ఆయన చెప్పారు. సామాజిక న్యాయాన్ని తమ పార్టీ సాధించి తీరుతుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X