వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పై బయటపడ్డ హైకమాండ్

By Staff
|
Google Oneindia TeluguNews

Jayanthi Natarajan
న్యూఢిల్లీ: ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రోశయ్యనే కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేత అని పార్టీ అధికార ప్రతినిధి జయంతీ నటరాజన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ప్రతిష్టంభనా లేదని, ఇదే పార్టీ అధికారిక ప్రకటన అని ఆమె బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దీంతో జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని వస్తున్న డిమాండ్ వేడిని తగ్గించడానికి పార్టీ అధిష్ఠాన వర్గం ఒక పద్ధతి ప్రకారం వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఉన్నారని, ఆయనే ప్రస్తుతానికి సిఎల్పీ నేత అని జయంతీ నటరాజన్ అన్నారు.

రోశయ్యను సిఎల్పీ నాయకుడిగా ఎన్నుకోలేదు కదా అని మీడియా ప్రతినిధులు అనగా అది జరిగిన వెంటనే తెలియజేస్తామని ఆమె అన్నారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించినట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. రోశయ్యకు మంత్రులంతా సహకరిస్తున్నారని, వ్యవహారాలు సక్రమంగా సాగుతున్నాయని ఆమె అన్నారు. రోశయ్య ముఖ్యమంత్రి ఛాంబర్ కు మారకపోవడంపై ప్రస్తావించగా ఎందుకు మారలేదో ఆయననే అడగాలని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X