హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పై హైకమాండే : జెసి

By Staff
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే విషయంపై పార్టీ అధిష్టాన వర్గమే నిర్ణయం తీసుకుంటుందని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన గురువారంనాడు గాంధీభవన్ లో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను కలిశారు. అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి డిఎస్ ను ప్రశంసించడానికి తాను వచ్చానని ఆయన చెప్పారు. సిఎల్పీ నేతగా ముఖ్యమంత్రే ఉంటారని కాంగ్రెసు అధికార ప్రతినిధి జయంతీ నటరాజన్ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించగా జయంతీ నటరాజన్ చెప్పారంటే పార్టీ అధిష్ఠాన వర్గం చెప్పినట్లేనని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ కెవిపి రామచందర్ రావుపై విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి కెవిపి రామచందర్ రావును బాధ్యులను చేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వైయస్ హెలికాప్టర్ ప్రమాదానికి అధికారులు బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X